పులకరింత-మిటకరింత


"కోఠి నుండి ఉప్పల్‌కి వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుందంటారు?" నగరానికి కొత్తగా వచ్చిన ఓ వ్యక్తి సగటు నగర పౌరుణ్ణి అడిగాడు.

"మామూలుగా మీరు బస్‌లో వెళితే.. ఉదయం ఐదున్నర, ఆరు గంటల ప్రాంతంలో అయితే పావుగంటలో వెళ్ళొచ్చు.. ఏడు ఎనిమిది గంటల ప్రాంతంలో అయితే అరగంటలో వెళ్ళొచ్చు.. తొమ్మిది నుండి పదకుండు గంటల ప్రాంతంలో లేదా సాయంత్రం నాలుగు నుండి రాత్రి పది గంటల ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువుంటుంది కాబట్టి ముప్పవుగంటలో వెళ్ళొచ్చు" అని చెప్పాడు నగర పౌరుడు.

"మరి బైక్‌పై వెళితే?" అడిగాడు కొత్త వ్యక్తి.

"ట్రాప్ఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాల మధ్య సందుల్లోంచి దౌడు తీయిస్తూ, రెడ్‌లైట్‌కి కూడా కనీస మర్యాద ఇవ్వకుండా వెళ్ళిపోతే అరగంటలో వెళ్ళొచ్చు" అన్నాడు.

కొత్త వ్యక్తి "ఓ"ని వదిలి "హో!'ని వదిలేలోపే, నగర పౌరుడు "అది కూడా గ్యారంటీ లేదు!" అన్నాడు. దాంతో "హో!"ని నోటి గ్రైండర్‌లో నాలుకతో మిక్సి చేసి దాన్ని "హౌ?"గా వదిలాడు కొత్త వ్యక్తి.

"మధ్యలో అంబర్‌పేట్‌లో స్మశానవాటికుంది. ఎవరైనా ప్రముఖ నాయకులు చనిపోయినా.. లేక చనిపోయినవాడి శవానికి రాజకీయ రంగు అదిమి ఆ శవయాత్రని ప్రముఖంగా మార్చినా.. ఆ శవం, దాంతో పాటు అక్కడికి వందల్లో జనాలు, వాళ్ళ అరుపులు, నినాదాలు, వాళ్ళతో సమానంగా పోలీసులు, మీడియా వాళ్ళు అక్కడికి చేరుకుని దహన కార్యక్రమం జరిగాక మళ్ళీ ఆ జనాల్ని, మీడియాని పోలీసులు పంపించేసరికి రెండు మూడు గంటలైనా పట్టొచ్చు" అన్నాడు.

"అలాకాకుండా.. ఏ వాహనం మీదైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమయంలోనైనా కోఠి నుంచి ఉప్పల్ వెళ్ళాలంటే ఎంత సమయం పడుతుందంటారు?" అనడిగాడు కొత్త వ్యక్తి.

నగర పౌరుడికి ఒళ్ళు మండింది. కాని అతని ఒంటి మీద నదలా పారుతున్న చెమటతో మంట చల్లారిన భావనలో, అమాయకంగా కనిపిస్తున్న కొత్త వ్యక్తి వంక విచారంగా చూసతూ " నీకు మాయలు, మంత్రాలు వస్తే ఇక్కడ మాయమై అక్క ప్రత్యక్షమవడానికి ఒకటి రెండు సెకన్లు పట్టచ్చ.. లేదా సి.ఎం.లా హెలికాప్టర్‌లో వెళితే ఒకటి రెండు`నిమిషాల్లో వెళ్ళొచ్చు. ఈ పరిస్థితుల్లో కాకుండ మరే పరిస్థితుల్లోనైనా ఎంత సమయంలో వెళ్ళొచ్చో చప్పే తెలివితేటలు ఆ బ్రహ్మ దేవుడు నాకివ్వలేదు" ని దీనంగా చెప్పాడు.

"బస్సెక్కి అరగంటైనా ఉ్పల్ ఇంకా రాకపోతేనూ..!" అంటూ చేతి రుమాలుతో మొహం పై ఊరుతోన్న చెమటను తుడవలేక అవస్థపడుతూ, సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్టు అన్నాడు కొత్త వ్యక్త.

నగర పౌరుడు వేదంతిలా ఓ నవ్వు నవ్వి "నువ్వ ఈ నగరానికి కొత్త కదా నాయనా..! మొదట్లో అలాగే ఉంటుది, మెల్లిగా అదే అలవాటవుతుంది" అని కాస్త ధైర్యా్ని నూరి అతని చెవిలో పోశాడు.

వీళ్ళ సంభాషని వింటున్న మరో ఉడుకు రక్తపు యువకుడు " 'షో'నియా వ్చి అక్కడ షో చేస్తోంది కదా! బస్సులన్నిటిని అక్కడికి పంపించారు. రెండు గంటల తర్వాత వచ్చిన ఈ బస్సులో లెక్కపెట్టలేనంత మంది ఎక్కారు కదా.. అందుకే ఇంత`మెల్లిగా వెళ్తూ అంత సమయం తీసుకుంటోంది!" అని అర్ం వచ్చేలా అందమైన భూతుల భాషలో ఆవేశంగా చెప్పాడు.

"ఆవిడ సభకు ప్రైవేటు వాహనాల్ని ఏర్పాటు చేసుకోవాలి కాని ఇలా ఆర్.టి.సి. బస్సుల్ని అక్కడకు పంపి మనల్ని ఇబ్బందులకు గురిచెయ్యడమెందుకు?!" ఆశ్చర్యం, విచారం కలగలిసిన స్వరంలో అన్నాడా కొత్త వ్యక్తి.

ఇంతలో డ్రైవర్ బస్సాపాడు. కండక్టర్ మామూలు కంటే నాలుగు రెట్లు వేగంగా టికెట్లిచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎప్పటిలా ఐదునిముషాలు ఓపిక పట్టారు జనాలు. ఆ తర్వాత "డ్రైవర్‌గారు.. బస్సుని కొంచెం మెల్లిగా అయినా నడపండి, ఉక్కపోతని భరించలేకపొతున్నాం" అంటూ విన్నవించుకున్నారు.

డ్రైవర్ నుంచి స్పందన రాలేదు.

"రైట్ రైట్" అని అర్థం స్ఫురించేలా చేత్తో బస్ పైభాగాన్ని కొట్టసాగారు.

డ్రైవర్ ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు.

కాస్త గట్టిగా కొట్టారు.

అయినా స్పందన రాలేదు.
ఓ పావుగంట కొట్టి కొట్టి చివరికి విసుగొచ్చి ఆపేశారు. కండక్టర్ కిమ్మనకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. అలా అనడం కన్నా, కిమ్మనే తీరిక లేక అలా టికెట్లు ఇస్తూ జనారణ్యాన్ని దాటుకుంటు వెళ్తున్నాడు అనడం కరెక్టేమో! పొద్దంతా పనిచేసొచ్చి నీరసంగా ఉన్న శరీరాలతో బస్‌లో నిలబడి ఆ ఉక్కపోతని భరించలేక ఆ అసహన్నాన్ని డ్రైవర్ మీద చూపిస్తూ కోప్పడసాగారు. పాపం! ఆయన మాత్రం ఏం చేస్తాడు.. టికెట్స్ తీసుకునేంత వరకూ బస్ ఆగుండాల్సిందేనని కండక్టర్ హుకుం జారీ చేశాడు.. ఈ రోజు చెకింగ్ అధికారులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారని కండక్టర్‌కి కబురందింది మరి! ఆయన బాధ ఆయనది! డ్రైవర్ బాధ డ్రైవర్‌ది! జనాల తిప్పలు జనాలవి!

ఇంతలో ఒక ప్రయాణికుడు "అమ్మ రాకతో పెరేడ్ గ్రౌండ్స్ పులకరింత-బస్సులు లేక ప్రజలు గుడ్లు మిటకరింత" అన్న హెడ్‌లైన్‌తో రేపు పేపర్లో న్యూసొస్తుంది" అన్నాడు.

తమ మీద తామే విసురుకున్న చలోక్తిని విన్న వారందరూ హాయిగా నవ్వుకున్నారు.

గడచిన ఐదేళ్ళని అవలోకనం చేసుకుంటూ "వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని గెలిపించొద్దు" అన్నాడు మరో వ్యక్తి కాస్త బాధతోనే!

బస్‌లోపల్నించి ఓ వ్యక్తి వెంటనే స్పందించాడు "ఏం తక్కువ చేశాడండీ రాజశేఖర్ రెడ్డి గారు?" అని అరిచాడు.

ఇంతలో బస్సు కదిలింది.. కిటికీల్లోంచి చల్లగాలి వీయసాగింది.. దాంతో ఆ చల్లటి గాలికి ఓ పావుగంట అందరూ అలా మౌనంగా ఉండిపోయి సేదతీరారు.

"ఎవరికి ఓటెయ్యాలన్నది ఓటేసేంతవరకు ఆలోచించవచ్చు! కాని దాని కన్నా ముందు అందరూ ఓటేసేందుకు బయలుదేరడానికి ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోండి" అన్నాడు కొత్త వ్యక్తి.

"ఏప్రిల్‌లో పెట్టారు కదండీ ఎలక్షన్లు.! అప్పుడు ఎండలు బాగ ఎక్కువవుతాయి. ఆ ఎండలో ఆడాళ్ళని, పిల్లల్ని తీసుకెళ్ళాళంటే.. పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వందలు వందలు ఖర్చు పెట్టుకుని తీసుకెళ్ళాలంటే కొంచెం కష్టమే మరి!" అన్నాడు ఓ వ్యక్తి.

"ఐదేళ్ళ జీవిత గమనాన్ని శాసించే ఓటును వేసేందుకు తీరిక ఉండదు.. కాని ఆ ఐదేళ్ళు ఎంత ఇబ్బందికి గురైనా సర్దుకుపోయే ఓపిక మాత్రం ఉంటుంది" అన్నాడు లోపల్నుంచి ఓ వ్యక్తి.. కొత్త వ్యక్తి మనసు పొరల్లోంచి..!

ఇంతలో గంట ప్రయాణం తర్వాత ఉప్పల్ వచ్చింది. అందరూ దిగేసి ఎవరిళ్ళకి వారు చేరుకున్నారు. తిని హాయిగా నిద్దురపోయారు. లేచాక నిన్న జరిగింది మర్చిపోయారు. హుషారుగా తయారవసాగారు.. ఈ రోజైనా బస్‌లో సీటు దొరకబుచ్చుకోవాలన్న ఆశతో!