కణిక కథల పోటీ ఫలితాలు




కణిక (సాహిత్యం, సామాజిక సేవ, విద్యారంగ వేదిక) సంస్థ, మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు అనే అంశంపై "దిశ - దుర్దశ"  పేరుతో జనవరి 2020లో నిర్వహించిన కథల పోటీ ఫలితాలను, ఈ నెలలో (జులై 2020) జరిగిన కణిక మొదటి వార్షికోత్సవం సందర్భంగా, కణిక అధ్యక్షురాలు రమాదేవి కులకర్ణి గారు ప్రకటించారు. ఈ కథల పోటీలలో మొదటి స్థానం శ్రీ డా|| యం. సుగుణా రావు గారు, రెండవ స్థానం శ్రీ ఆలూరి అరుణ్ కుమార్ గారు, మూడవ స్థానం శ్రీ విమన్ శర్మ గారు  పొందారు.

కోవిడ్ కారణంగా ఈ వార్షికోత్సవాన్ని యూ ట్యూబ్ వేదికగా నిర్వహించారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ డా|| నందిని సిద్ధారెడ్డి గారు, కార్యదర్శి డా|| ఏనుగు నరసింహా రెడ్డి గారు, తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ గారు, నేషనల్ బుక్ ట్రస్ట్ సంపాదకులు డా|| పత్తిపాక మోహన్ గారు, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు డా|| నాళేశ్వరం శంకర్ గారు, ప్రముఖ కవి విమర్శకులు దాస్యం సేనాధిపతి గారు, నేటి నిజం సంపాదకులు బైసా దేవదాస్ గారు, ఆల్ ఇండియా రేడియో సీనియర్ అనౌన్సర్ ఐనంపూడి శ్రీలక్ష్మి గారు, సినీ గీత రచయిత మౌన శ్రీ మల్లిక్ గారు మరియు మరికొంత మంది సాహిత్య సామాజిక విద్యా రంగ ప్రముఖులు పాల్గొని తమ తమ వీడియోల ద్వారా ఆశీస్సులు, అభినందనలు తెలియజేశారు.

ఆ వార్షికోత్సవ వేడుకల వీడియోని ఇక్కడ చూడవచ్చు: https://youtu.be/W6aktcVKOgE

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి